రాహుల్ హత్యకు కుట్ర.. ఎన్డీయే నేతల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

75చూసినవారు
రాహుల్ హత్యకు కుట్ర.. ఎన్డీయే నేతల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. ఈ మేరకు బీజేపీ నేతలపై భుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అలాగే, ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అజయ్‌ మాకెన్‌ పంపారు. చాలా మంది ఎన్డీయే నేతలు రాహుల్ గాంధీని టెర్రరిస్టు అని విమర్శించారని, ఆయనపై దాడి చేస్తామని బెదిరిస్తున్నారని వారు తెలిపారు.