బాలరాముడి దర్శనం.. ట్రస్ట్ కీలక నిర్ణయం

56చూసినవారు
బాలరాముడి దర్శనం.. ట్రస్ట్ కీలక నిర్ణయం
అయోధ్య రామమందిరంలో బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో ట్రస్టు మార్పులు చేసింది. తాజాగా ట్రస్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాలరాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వనున్నారు. దీంతో బాల రాముడికి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్