మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్నీదేవి (55) అనే మహిళకు ఇద్దరు కొడుకులు. ఇటీవల మున్నీదేవిని ఇద్దరు కోడళ్లు దారుణంగా కొట్టారు. రాళ్లు విసిరి, కర్రలతో బాది ఆమెను హింసించారు. దీనిని అడ్డుకోవాల్సిన మున్నీదేవి కొడుకులు చూస్తూ ఆనందించారు. కోడళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మున్నీదేవిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.