లద్దాఖ్ ప్రమాదంలో చనిపోయిన జవాన్ల భౌతికకాయాలు విజయవాడ చేరుకున్నాయి. లద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. గ్వాలియర్ నుంచి ప్రత్యేక ఎయిర్ఫోర్స్ విమానంలో సుభాన్ ఖాన్(బాపట్ల జిల్లా ఇస్లాంపూర్), సాదరబోయిన నాగరాజు(కృష్ణా జిల్లా పెడన), ఆర్.కృష్ణారెడ్డి(ప్రకాశం జిల్లా గిద్దలూరు)ల పార్థివదేహాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాయి.