ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు వైభవంగా గుజరాత్లోని జామ్నగర్లో జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సినీ హీరో రామ్చరణ్ దంపతులు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. వారంతా కలిసి వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.