దేశమంతటా స్వాతంత్య్రోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. వెట్టి చాకిరీ దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని ప్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో పోరాట సంఘమేర్పడింది. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా మారి దొరలు, విస్నూర్ దొరల ఆటలను అరికట్టించారు.