అన్‌ఎకాడమీలో మరోసారి ఉద్యోగుల తొలగింపు

54చూసినవారు
అన్‌ఎకాడమీలో మరోసారి ఉద్యోగుల తొలగింపు
ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌ఎకాడమీ మరోసారి ఉద్యోగులను తొలగించింది. అన్ని విభాగాల నుండి సుమారు 250 మందిని తొలగించినట్లు బుధవారం నివేదికలు వెల్లడించాయి. వీరిలో సేల్స్‌కి చెందిన 150 మంది కూడా ఉన్నారు. ఈ సంస్థ 2022లో సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. మరో ఆన్‌లైన్‌ సంస్థతో విలీనం కానుండటంతో ఈ తొలగింపులు చేపట్టినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్