ఢిల్లీతో నిన్న మ్యాచ్లో సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో 7000 పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్గా నిలిచాడు. అలాగే ఓ ఓవర్లో 20 లేదా 20+ పరుగులను అత్యధిక సార్లు సాధించిన భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా, ఐపీఎల్లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు.