మెట్రో రైలు సేవలకు బుధవారం సాయంత్రం అంతరాయం ఏర్పడింది. దీంతో మియాపూర్- ఎల్బీనగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతోనే నిలిపివేసినట్టు లోకో పైలట్లు తెలిపారు. మరోవైపు HYDలో భారీ వర్షం కారణంగా మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ మిషన్లు మొరాయించడంతో బయటకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.