అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అని చెప్పా: సుధామూర్తి

64చూసినవారు
రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి తనకు ఓసారి ఫోన్‌ వచ్చిందని తెలిపారు. దాన్ని నమ్మలేక ‘రాంగ్‌ నంబర్‌’ అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత అబ్దుల్‌ కలాంతో మాట్లాడానని తెలిపారు. ‘ఐటీ డివైడ్‌’ అనే అంశంపై నేను రాసిన కాలమ్‌ను తాను చదివానని, బాగుందని అబ్దుల్‌ కలాం చెప్పారంటూ నాటి సంగతిని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత పోస్ట్