కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో డెంగ్యూ కేసులు పంజా విసురుతున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. గత మూడు వారాల్లో మొత్తం 1,036 కేసులు నమోదవగా, వాటిలో బీబీఎంపీ పరిధిలోనే డెంగ్యూ కేసులు 1,000 మార్క్ను దాటాయని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతివార్డులో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటుచేశామని బెంగళూరు మహానగర పాలక సంస్థ తెలిపింది.