గౌతమ బుద్ధుడు మానవుని కష్టాలకు కారణం శోధిస్తూ దేశాటన చేస్తూ చివరకు గయలోని బోధి వృక్షం కింద కూర్చుని ఉన్నప్పుడు 'కోరికలే మానవుని దుఃఖానికి కారణం' అనే నగ్నసత్యాన్ని గ్రహించారు. ఈ విధంగా బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది. ఏ బోధి వృక్షం కింద బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందో బుద్ధ పూర్ణిమ రోజు ఆ బోధి వృక్షాన్ని పూజిస్తారు.