వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్యాదవ్ మాట్లాడుతూ 'తుమ్మురుకోట, చింతపల్లి, పాల్వాయ్గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతోందని, ఆ ప్రాంతంలో ఓటర్లను టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి పోలీసులకు చెబుతున్నా పట్టించుకోలేదు. ఈ ప్రాంతాల్లో ఈసీ రీఎలక్షన్ జరిపించాలనుకోలేదని, ఎలక్షన్ కమీషన్ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైందని' ఆరోపణలు చేశారు.