ప్ర‌ధాని వివాదాస్పద ప్ర‌సంగంపై ఈసీ కీలక వ్యాఖ్యలు

58చూసినవారు
ప్ర‌ధాని వివాదాస్పద ప్ర‌సంగంపై ఈసీ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ప్రధాని మోదీ కాంగ్రెస్, ముస్లింలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆ వ్యాఖ్య‌ల‌పై ప‌లు పార్టీలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అయితే ఆ ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఈసీ చెప్పింది. ఒక‌వేళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల సంప‌ద‌ను ముస్లింల‌కు పంచుతామ‌ని కాంగ్రెస్ తెలిపింద‌ని, దేశ వ‌న‌రుల‌పై తొలి హ‌క్కు మైనార్టీల‌దేనని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.