ఎక్కడైనా వివాహ వయసు వచ్చిన కూతురికి పెళ్లి సంబంధాలను చూడడం సాధారణమే. మ్యారేజ్ బ్యూరో, పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా పెళ్లి కొడుకులను వెతుకుతుంటారు. కొన్నిసార్లు న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇస్తుంటారు. అయితే కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ కుటుంబం 30 ఏళ్ల క్రితం మరణించిన తమ కుమార్తె కోసం మరణించిన పెళ్లి కుమారుడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట చర్చనీయాంశమైంది.