కర్ణాటకలోని తుళునాడులో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అక్కడ ప్రజలు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చనిపోయిన తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. తుళు మాసం వచ్చిందంటే ప్రత్యేకించి మరీ ఈ వివాహాలు జరిపిస్తారు. తుళు మాసంలో పెళ్లిళ్లు తప్ప మరే ఇతర శుభకార్యాలను నిర్వహించరు. 'ప్రేత మడువే' అని పిలుచుకునే ఈ ఆచారంలో సాధారణ పెళ్లి తరహాలోనే వివాహ కార్యక్రమం జరిపిస్తారు.