ఏపీలో అల్లర్లపై ఈసీ కఠిన చర్యలు.. వాళ్లంతా సస్పెండ్

1558చూసినవారు
ఏపీలో అల్లర్లపై ఈసీ కఠిన చర్యలు.. వాళ్లంతా సస్పెండ్
ఏపీలో అల్లర్లపై ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇచ్చిన వివరణతో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. అదే సమయంలో, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.