ఎన్నికలను కవర్ చేస్తోన్న జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. వారికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతోపాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించాలని గిల్డ్ అన్ని రాజకీయ పార్టీలు, కార్యకర్తలను కోరింది.