ఒడిశా-ఛత్తీస్గఢ్ హైవేపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేసే క్రమంలో వేగంగా వచ్చిన స్కార్పియో కారు రిక్షాను, బైక్ను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో ఆరుగురు, ఓ బైకర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే స్కార్పియో కారులో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.