ప్రమాదంలో తండ్రి మృతి. పక్కనే నిద్రించిన కుమారుడు

194651చూసినవారు
ప్రమాదంలో తండ్రి మృతి. పక్కనే నిద్రించిన కుమారుడు
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వెంగల్ పాడుకు చెందిన మాలవత్ రెడ్డి(34) అనే వ్యక్తి తన మూడేళ్ల కొడుకు నితిన్ తో కలిసి యాచారంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా సదాశివనగర్ అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాలవత్ స్పాట్ లోనే చనిపోగా, బాలుడు ఏడుస్తూ తండ్రిని లేపేందుకు యత్నిస్తూ అలాగే నిద్రపోయాడు. తెల్లవారాక ఓ స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సంబంధిత పోస్ట్