సౌతాఫ్రికా ఫుట్బాల్ ప్రపంచంలో దారుణం చోటుచేసుకుంది. యువ ఫుట్ బాలర్ ల్యూకె ఫ్లెయర్స్(24)ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా చంపేశారు. జొహన్నెస్బర్గ్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద దుండగులు కాల్పులు జరపడంతో ల్యూకె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ల్యూకె హత్యపై పోలీసులు మర్డర్, కారు హైజాకింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ల్యూకె టోక్యో ఒలింపిక్స్లో అండర్-23 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.