ఇండియన్ ఎయిర్స్ఫోర్స్కి చెందిన అపాచీ హెలికాప్టర్ను లడఖ్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారని వైమానిక దళం గురువారం వెల్లడించింది. ఈ ఘటన బుధవారం జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఎయిర్ఫోర్స్ కోర్టు విచారణకు ఆదేశించింది. ల్యాండింగ్ ప్రక్రియలో కఠినమైన భూభాగం, ఎత్తయిన ప్రదేశం కావడంతో హెలికాప్టర్ దెబ్బతిన్నట్లు తెలిపింది.