దేశంలో తొలిసారిగా లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మొట్టమొదటగా ఈ సర్వీస్ తమిళనాడు రాజధాని చెన్నైలో మొదలు కానుంది. ఈ మేరకు ఆగష్టులో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) తన మొదటి డ్రైవర్లెస్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆగస్ట్లో ఒక రైలు సెట్ వస్తుందని, ఆ తర్వాత మరో రెండు నెలల్లో మరో 6 రైలు సెట్లు వస్తాయని అధికారులు వెల్లడించారు.