2020 నుంచి 2030 మధ్య కాలంలో టైమ్కు వ్యాక్సిన్ అందకపోవడంతో చిన్నారుల అదనపు మరణాల సంఖ్య 50 వేలను మించిందని తాజా అధ్యయనం వెల్లడించింది. మీజిల్స్, రుబెల్లా, హెచ్ పివి, హెపటైటిస్ బి, మెనింజైటిస్ ఎ, ఎల్లో ఫీవర్ టీకాల కవరేజీపై కొవిడ్ భారీ ఎఫెక్ట్ చూపింది. అధికంగా మీజిల్స్ వ్యాక్సిన్ కవరేజీ అంతరాయం కారణంగానే చనిపోయారు. మీజిల్స్ ఇమ్యునైజేషన్లో లోపంతో 44,500 కంటే ఎక్కువ మంది చనిపోయారని తెలిపారు.