ప్రజలు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ సురేష్ అన్నారు. శనివారం నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టం ముందు పేద ధనిక అనే బేధాలు ఉండవని అందరూ సమానమని అన్నారు. చట్టాలపై అవగాహన లేని వారికి కోర్టులు ప్రత్యేకంగా న్యాయవాదులను ఏర్పాటు చేశామని వారు సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. న్యాయవాదులు పాల్గొన్నారు.