హీరోయిన్ జెనీలియా 2012లో 'నాఇష్టం' సినిమా తర్వాత నితేష్ దేశ్ముఖ్ని పెళ్లాడి, సినిమాలకు పుల్స్టాప్ పెట్టేశారు. రీసెంట్గా భర్తతో కలిసి సొంతంగా చిత్ర నిర్మాణం కూడా మొదలుపెట్టిన జెనీలియా.. తన భర్త రితేష్తో కలిసి మరాఠీలో ‘వేద్’ సినిమాలో నటించారు. అలాగే మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో అల్లరి 'హాసిని' తెలుగు ఎంట్రీ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.