యూపీలోని సహరాన్పూర్లో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు 15 ఏళ్ల బాలికలు తమకు పెళ్లి చేయాలంటూ పీఎస్కు వెళ్లారు. చేతిలో చేయి వేసుకొని తాము ప్రేమించుకుంటున్నామని తమకు పెళ్లి జరిపించాలని కోరారు. ఆశ్చర్యపోయిన పోలీసుల వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదుట బాలికలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.