దేశీయంగా ఆహార భద్రతను ఉత్పత్తి, యాజమాన్యం, సమన్వయం అనే మూడు కోణాల నుంచి ఎదుర్కోవాలి. ఉత్పత్తి పరంగా ప్రత్యేక వ్యవసాయ జోన్లను ఏర్పాటు చేసి, సమాచార-సాంకేతిక విజ్ఞానంతో వాటిని పర్యవేక్షించాలి. రేషన్ కార్డు-ఆధార్కార్డులను అనుసంధానించి అసలైన లబ్ధిదారులకే రాయితీ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. నిల్వల విషయంలోనూ పారదర్శకత పాటించాలి. పాలకులు పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు సాగితేనే దేశీయంగా ప్రజలకు ఆహార భద్రత సాధ్యమవుతుంది.