రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌

54చూసినవారు
రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌
భద్రాచలంలో భక్తులు అందించే తలంబ్రాలు ఎంతో ప్రత్యేకమైనవి. కేవలం ఈ తలంబ్రాలను స్వీకరించేందుకే ప్రజలు పెద్ద ఎత్తున భద్రాచలం వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భద్రాచలం వెళ్లలేని వారు కూడా ఇంటి వద్దకే తలంబ్రాలను తెప్పించుకునేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ అవకాశం కల్పిస్తుందన్న విషయం తెలిసిందే. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును #TSRTC పొడిగించింది. ఈ నెల 25 తేదీ వరకు బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్