ముంబైలోని విధాన్ భవన్ ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ నివాళులు అర్పించారు. అనంతరం సభలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అజిత్ పవార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అన్నపూర్ణ యోజన కింద ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఈ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తెలిపారు.