న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

67చూసినవారు
న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 59 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రూక్‌ (39), గ్రీన్‌ (31) రాణించారు. భారత బౌలర్లు రాధా యాదవ్‌ 3, సైమా 2, దీప్తి, అరుంధతి చెరో వికెట్‌ తీశారు. అలాగే బ్యాటింగ్‌ చేసిన భారత్ 227 పరుగులకు ఆలౌట్ అయింది. తేజల్ (42), దీప్తి శర్మ (41) పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్