మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. 'వేరే పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోం అని రాహుల్ అన్నారు. కానీ, ఉత్తమ్ మాత్రం రాహుల్ వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడుతున్నారు. 25 మంది మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. కేసీఆర్పై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.' అని మండిపడ్డారు.