సూర్యాపేట జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దురాజ్పల్లిలోని జయశంకర్ పాలిమర్స్ పేపర్, ప్లాస్టిక్ గ్లాసుల తయారీ గోదాంలో ఆదివారం షార్ట్ సర్య్కూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో మిషనరీతో పాటు ముడిసరుకు పూర్తిగా దగ్ధమైంది. సుమారు కోటి రూపాయల వరకు ఆస్థి నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.