భారీ వర్షాలు. 19 మంది మృతి (వీడియో)

13820చూసినవారు
ఉత్తరాదిలో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌ లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. యుమున సహా పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి వేర్వేరు ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. ఉత్తరాదిలో వర్షాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్