పంజాబ్లోని పఠాన్ కోట్ భారత వాయుసేన కీలక స్థావరం. తాజాగా ఈ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో బుధవారం జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. పలు గ్రామాల్లో దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బోర్డర్ రేంజి డీఐజీ రాకేశ్ కుశాల్ మాట్లాడుతూ గత రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బీఎస్ఎఫ్, సహా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకు అలర్ట్లు జారీ చేశామన్నారు.