‘ఇండియా’ కూటమి పేరుపై హైకోర్టు ఆదేశాలు

83చూసినవారు
‘ఇండియా’ కూటమి పేరుపై హైకోర్టు ఆదేశాలు
విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టడంపై దాఖలైన పిటిషన్‌పై 7రోజుల్లో స్పందించాలని కేంద్రం, ప్రతిపక్షాలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాదనలు ఈ నెల 10న వింటామని మంగళవారం తెలిపింది. ఈ విషయంలో కేంద్రం, ప్రతిపక్షాలకు ఇప్పటికే 8 అవకాశాలిచ్చినా.. స్పందన రాలేదని పిటిషనర్ తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. కాగా, గతంలో యూపీఏ గా ఉన్న విపక్ష కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం దేశం పేరు వాడుకుంటోందని ఈ పిల్ దాఖలైంది.

సంబంధిత పోస్ట్