హుజూర్‌నగర్ లో అత్యధికంగా 29.3 సెం.మీ వర్షపాతం నమోదు.. 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్: ఐఎండీ

56చూసినవారు
హుజూర్‌నగర్ లో అత్యధికంగా 29.3 సెం.మీ వర్షపాతం నమోదు.. 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్: ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ లో శనివారం అత్యధికంగా 29.3 వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. చిలుకూరులో 28.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 20 సెం.మీ పైగా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్