దూద్ బౌలి డివిజన్ పరిధిలో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ గురువారం పర్యటించారు. స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ సలీం తో కలిసి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఎంపీ నిధులతో స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. ఎల్లప్పుడూ తమకు అందుబాటులో ఉండే అసదుద్దీన్ ఓవైసీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.