

బహదూర్ పురా: రోడ్డు ప్యాచ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
జహానూమ డివిజన్ పరిధిలోని గౌస్ నగర్లో రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేపట్టారు. ఈ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ ముక్తాధార్ బాబా పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లుదెబ్బ తిన్నాయని అందుకే రోడ్లు మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే అవసరం ఉన్న ప్రాంతాల్లో నూతన రోడ్డు పనులు చేపట్టేలా చూస్తామని కార్పొరేటర్ వెల్లడించారు.