ఎన్నికల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక హామీలిచ్చారు. "కూటమి ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాం. వారి సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ఇస్తా." అని పాలకొండ సభలో పవన్ తెలిపారు.