జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని ఖైరతాబాద్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ విజయ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పూజారులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, బోనాల పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.