పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

84చూసినవారు
పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు
తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌‌గా ఇలంబరిది, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా ఎన్. శ్రీధర్‌, విద్యుత్ శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్టియానా, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా శ్రీదేవి ఇన్ ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.