కంటతడి పెట్టిన నివేదిత

71చూసినవారు
కంటతడి పెట్టిన నివేదిత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 8వ వార్డు పరిధిలోని ఆదర్శ్ నగర్ లో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న, మాజీ బోర్డు సభ్యులు లోక్ నాథ్ కలిసి బస్తీ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ కళాకారుడు పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించింది. దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్యనందితను గుర్తుచేస్తూ ఆయన పాడిన పాటకు నివేదిత కంటతడి పెట్టుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలంతా బీఆర్ఎస్ కు జనమంతా జయజయ ధ్వానాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న వెన్నంటి ఉంటామన్నారు. నివేదితమ్మను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పింజర్ల మురళి యాదవ్, జంగాల మురళి యాదవ్ తదితరులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్