ఇండియా అంటే తనకెంతో ఇష్టమని ప్రముఖ పాప్ సింగర్ ఎడ్ షీరన్ అన్నారు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఆయన కోసం బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఎడ్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు తన పాటలను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. ‘‘ఏడాది క్రితం నా స్నేహితులతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ వీక్షించా. ఇదొక అద్భుతమైన చిత్రం. ‘నాటు నాటు’ డ్యాన్స్ చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు.