'మళ్లీ పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కను'

66చూసినవారు
‘మళ్లీ పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కను’ అంటూ ఓ ప్రయాణికుడు తన ఆగ్రహాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అకల్‌ ధింగ్రా అనే వ్యక్తి న్యూయార్క్‌ నుండి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, కుర్చీలు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. దీంతో పలువురు ప్రయాణీకులు వారి అనుభవాలను కూడా పంచుకుంటున్నారు.

ట్యాగ్స్ :