యోగి వేమన వర్సిటీ(YVU) ఉప కులపతి చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఉన్నత విద్యామండలి ఆమోదించింది. వీరిద్దరూ వైసీపీతో అంటకాగినట్లు ఆరోపణలున్నాయి. ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా వైవీయూ ప్రిన్సిపల్ రఘునాథ్రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు విక్రమ సింహపురి వర్సిటీ రిజిస్ట్రార్ పదవికి రామచంద్రారెడ్డి రాజీనామా చేసి కడపలోని వైవీయూలో ప్రొఫెసర్గా చేరారు.