వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని నోటిఫై చేయడంపై రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో సీఏఏ అమలుపై కేంద్రం నిర్ణయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. మానవతతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో సీఏఏ అమలు చారిత్రాత్మకమని పేర్కొంటూ ట్వీట్ చేశారు.