ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనేది ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు. టీ 20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్ 2007 దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. ఇందులో భారత్ 5 పరుగుల తేడాతో పాక్ పై విజయం సాధించింది. ఎంఎస్ ధోని సారథ్యంలో ఆడిన భారత్ ఫైనల్ పోరులో పాకిస్థాన్ను ఓడించి ఈ టోర్నీని గెలుచుకుంది. ఈ ఫైనల్ లో 20 ఓవర్లలో ఇండియా 157/5 పరుగులు చేయగా.. 19.3 ఓవర్లకి పాక్ జట్టు 152 కి ఆల్ అవుట్ అయ్యింది.