తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తోంది. బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని కాంగ్రెస్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా గాడిద గుడ్డు అంటూ పెద్ద గుడ్డును తాజాగా గాంధీభవన్ వద్ద ఏర్పాటు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కేంద్రం ఇచ్చిన హామీల లిస్టును జతచేసి.. ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ పెద్ద గుడ్డును ఏర్పాటు చేసింది.