భారత్ ఇప్పటికీ అత్యంత పేద దేశమేనని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. జి20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్నప్పటికీ.. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ పేద దేశమేనని పేర్కొన్నారు. సిఎన్ఎన్ ఇంటర్యూలో ‘ రాజన్ మాట్లాడుతూ.. భారత్లోని నిరుద్యోగ సమస్యపై విమర్శలు గుప్పించారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం.. 2024 ఏప్రిల్ నాటికి భారత్లో 8.1 శాతం నిరుద్యోగం ఉందన్నారు.